విండీస్‌తో మూడో టి20కి సిద్ధార్థ్‌ కౌల్‌ 

10 Nov, 2018 02:10 IST|Sakshi

వెస్టిండీస్‌తో ఆదివారం చెన్నైలో జరుగనున్న ఆఖరి టి20 మ్యాచ్‌ నుంచి టీమిండియా పేసర్లు జస్‌ప్రీత్‌ బుమ్రా, ఉమేశ్‌ యాదవ్, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌లకు విశ్రాంతి ఇచ్చారు. రానున్న ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు ఈ ముగ్గురికి తగినంత విశ్రాంతి కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్‌ చౌదరి తెలిపారు. పంజాబ్‌ పేసర్‌ సిద్ధార్థ్‌ కౌల్‌ను జట్టులోకి తీసుకున్నారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ ఇప్పటికే 2–0తో నెగ్గిన విషయం తెలిసిందే. కౌల్‌ ఈ ఏడాది ఐర్లాండ్‌పై టి20 అరంగేట్రం చేశాడు. 

>
మరిన్ని వార్తలు