చెన్నై: కామన్వెల్త్ క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. స్క్వాష్ క్రీడలో స్వర్ణం సాధించిన దీపికా పళ్లికల్, జ్యోత్స్న చిన్నప్పలకు తమిళనాడు ప్రభుత్వం 50లక్షల రూపాయల బహుమానం ప్రకటించింది.
కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు 14వ పసిడి పతాకాన్ని స్క్వాష్ క్రీడాకారిణులు దీపికా పళ్లికల్, జోత్స్న చిన్నప్ప అందించారు. ఈ క్రీడల్లో స్వర్ణం సాధించిన తొలి భారత క్రీడాకారులుగా దీపికా పళ్లికల్, జోత్స్న చిన్నప్ప చరిత్ర సృష్టించారు.