అహ్మదాబాద్: రంజీ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్లో హైదరాబాద్ ఆటగాడు తన్మయ్ అగర్వాల్ గాయపడ్డాడు. బుధవారం మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తున్న తన్మయ్ అగర్వాల్ తలకు బంతి బలంగా తగిలింది. దీంతో అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
ఇక్కడి సర్థార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో చత్తీస్గఢ్తో జరుగుతున్న మ్యాచ్లో తన్మయ్ అగర్వాల్ షార్ట్ లెగ్లో ఫీల్డింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. చత్తీస్గఢ్ బ్యాట్స్మెన్ మనోజ్ సింగ్ కొట్టిన బంతి నేరుగా తన్మయ్ అగర్వాల్ తలకు తగలడంతో అతడు మైదానంలో పడిపోయాడు. ఫీల్డ్ అంపైర్లు వెంటనే మెడికల్ సిబ్బందిని పిలవగా.. వారు అతడిని ముందు జాగ్రత్తగా ఆసుపత్రికి తరలించారు.