తరుణ్‌ జంటకు టైటిల్‌ 

6 Mar, 2018 00:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జమైకా ఇంటర్నేషనల్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ కోన తరుణ్‌ డబుల్స్‌ టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. జమైకాలోని కింగ్‌స్టన్‌లో జరిగిన ఈ టోర్నీ పురుషుల డబుల్స్‌ ఫైనల్లో... తరుణ్‌–సౌరభ్‌ శర్మ (భారత్‌) జంట 21–17, 21–17తో గారెత్‌ హెన్రీ–రికెట్స్‌ (జమైకా) ద్వయంపై గెలిచింది.

సెమీస్‌లో ఈ జోడీ 21–5, 21–8తో టాప్‌ సీడ్‌ జోస్‌ గ్యురెవా–డానిల్లె టొర్రె (పెరూ) జంటపై విజయం సాధించింది.    

మరిన్ని వార్తలు