465 పరుగులకే టీమిండియా ఆలౌట్

29 Dec, 2014 08:21 IST|Sakshi
భారత్ ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 465 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ స్కోరు కంటే భారత్ 65 పరుగులు వెనకబడినట్లయింది. అజింక్య రహానే, విరాట్ కోహ్లీ బ్రహ్మాండమైన సెంచరీలు సాధించారు.
 
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. తొలి వికెట్ ను 57 పరుగుల వద్ద కోల్పోయింది. 40 పరుగులు చేసిన ఓపెనర్ వార్నర్.. రవిచంద్రన్ అశ్విన్ వేసిన బంతికి వికెట్ల ముందు దొరికేశాడు. రోజర్స్, వాట్సన్ క్రీజులో ఉన్నారు.
మరిన్ని వార్తలు