సెల్కాన్ వన్డే సిరీస్లో భాగంగా గురువారమిక్కడ జరుగుతున్న నాలుగో వన్డేలో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే 47 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. సింకదర్ రజా 7, మసకద్జ 10, సిబంద 24 పరుగులు చేసి అవుటయ్యారు. కెప్టెన్ టేలర్, విలియమ్స్ డకౌటయ్యారు. జింబాబ్వే 33 ఓవర్లలో 105/5 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. భారత బౌలర్లలో జడేజా రెండు వికెట్లు పడగొట్టాడు. మొహిత్ శర్మ, ఉనాద్కత్ చెరో వికెట్ తీశారు.
ఐదు వన్డేల సిరీస్ను టీమిండియా ఇప్పటికే గెల్చుకుంది. మిగతా రెండింటిలోనూ నెగ్గి క్లీన్స్వీప్ చేయాలన్న పట్టుదలతో భారత్ ఉంది. మరోవైపు జింబాబ్వే కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలవాలనే ఆశతో ఉంది. జింబాబ్వే జట్టు భారత్ను ఓడించాలంటే అన్ని రంగాల్లోనూ బాగా మెరుగుపడాలి. ఇప్పటివరకూ మూడు మ్యాచ్ల్లోనూ బ్యాటింగ్ విభాగం ఘోరంగా విఫలమైంది. మరోవైపు బౌలింగ్లో విటోరి, ఉత్సేయ మూడేసి వికెట్లు తీసుకోగా... మిగిలిన బౌలర్లు ప్రభావం చూపలేకపోతున్నారు.