హరారే: జింబాబ్వేతో జరుగుతున్న తొలి ట్వంటీ 20లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ కు దిగింది. టీమిండియా ఇన్నింగ్స్ ను అజింక్యా రహానే, మురళీ విజయ్ లు ఆరంభించారు. ఇప్పటికే వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి మంచి ఊపు మీద ఉన్న టీమిండియా ట్వంటీ20 సిరీస్ ను కూడా గెలవాలని భావిస్తుండగా, జింబాబ్వే ఇక్కడైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని యోచిస్తోంది. జింబాబ్వేతో రెండు ట్వంటీ20 మ్యాచ్ లను భారత్ ఆడనుంది.