తొలి వికెట్టు కోల్పోయిన భారత్

17 Jul, 2014 15:51 IST|Sakshi

లండన్:ఇంగ్లండ్ తో ఇక్కడ లార్డ్స్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ తొలి వికెట్టును కోల్పోయింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత భారత్ ను బ్యాటింగ్ ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ దిగిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్(7) వికెట్టును చేజార్చుకుంది. ప్రస్తుతం క్రీజ్ లో ఉన్న మరో భారత ఓపెనర్ మురళీ విజయ్ కు చటేశ్వర పూజారా జత కలిశాడు.ఆతిథ్య ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత్ ఐదు టెస్టు మ్యాచ్ లను ఆడనుంది. ఇరు జట్ల మధ్య జరిగిన తొలిటెస్టు డ్రా ముగిసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు