13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్

19 Jun, 2014 13:40 IST|Sakshi

మిర్పూర్: భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మూడో వన్డేకు వర్షం అంతరాయం కలిగించింది. ఆట జరుగుతుండగా వర్షం కురవడంతో మ్యాచ్ ను నిలిపివేశారు. ఆట నిలిచిపోయే సమయానికి 8.3 ఓవర్లలో భారత్ 3 వికెట్లు కోల్పోయి 13 పరుగులు మాత్రమే చేసింది.

రాబిన్ ఊతప్ప 5, రహానే 3 పరుగులు చేసి అవుటయ్యారు. అంబటి రాయుడు ఒక్క పరుగుకే పెవిలియన్ కు చేరాడు. పూజారా(3), తివారి(0) క్రీజ్ లో ఉన్నారు. మోర్తజా, ఆల-అమిన్, తస్కిన్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. మూడు వన్డేల సిరీస్ ను భారత్ ఇప్పటికే 2-0తో గెల్చుకుంది. రెండో వన్డేకూ వర్షం అంతరాయం కలిగించిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు