చెన్నై చేరిన భారత క్రికెటర్లు

13 Dec, 2019 01:51 IST|Sakshi

చెన్నై: ‘పొట్టి ఆట’ ముగియడంతో ఆటగాళ్లు వన్డే సిరీస్‌ ఆడేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా చెన్నైలో తొలి వన్డే జరుగనుండటంతో భారత్, వెస్టిండీస్‌ ఆటగాళ్లు గురువారం ఇక్కడికి చేరుకున్నారు. ఎం.ఎ.చిదంబరం స్టేడియంలో ఆదివారం ఇరుజట్ల మధ్య తొలి వన్డే జరుగుతుంది. చెన్నై రాక సందర్భంగా భారత కెప్టెన్‌ కోహ్లి... కుల్దీప్, జడేజాలతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్‌ చేసి ‘టచ్‌డౌన్‌ చెన్నై’ అనే క్యాప్షన్‌ పెట్టాడు.   

మరిన్ని వార్తలు