విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో టీమిండియాకు ఘన స్వాగతం

22 Feb, 2019 16:07 IST|Sakshi

విశాఖ: ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక పరిమిత ఓవర్ల సిరీస్‌లో భాగంగా భారత క్రికెటర్లు శుక్రవారం విశాఖకు చేరుకున్నారు.  ఈ మేరకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో భారత క్రికెటర్లకు ఘన స్వాగతం లభించింది. క్రికెటర్ల రాక తెలుసుకున్న అభిమానులు వారికి సాదర స్వాగతం పలికారు. ఎయిర్‌ ఇండియా విమానంలో భారత క్రికెట్‌ కోచ్‌ రవిశాస్త్రితో పాటు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, కృనాల్‌ పాండ్యా, ఉమేశ్‌ యాదవ్‌, కేఎల్‌ రాహుల్‌ తదితరులు నగరానికి చేరుకున్నారు. కాగా, ఆస్ట్రేలియా జట్టు ఈ రోజు సాయంత్రానికి విశాఖకు చేరుకుంటుంది. ఆసీస్‌తో రెండు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ ఆదివారం విశాఖలోని డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్‌  స్టేడియంలో జరుగనుంది. ( ఇక్కడ చదవండి: హార్దిక్‌ పాండ్యా ఔట్‌)

మరిన్ని వార్తలు