సెల్కాన్ వన్డే సిరీస్లో భాగంగా గురువారమిక్కడ జరుగుతున్న నాలుగో వన్డేలో భారత్కు జింబాబ్వే 145 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 42.4 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటయింది.
చిగుబుర 50, విలియమ్స్ 35, సిబంద 24, మసకద్జ 10 పరుగులు చేశారు. మిగతా ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. బారత బౌలర్లలో అమిత్ మిశ్రా 3, మొహిత్ శర్మ 2, జడేజా 2 వికెట్లు పడగొట్టారు. మహ్మద్ షమీ, ఉనాద్కత్ చెరో వికెట్ తీశారు.
ఐదు వన్డేల సిరీస్ను టీమిండియా ఇప్పటికే గెల్చుకుంది. మిగతా రెండింటిలోనూ నెగ్గి క్లీన్స్వీప్ చేయాలన్న పట్టుదలతో భారత్ ఉంది. మరోవైపు జింబాబ్వే కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలవాలనే ఆశతో ఉంది.