మిర్పూర్: బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ ఆరంభంలోనే వికెట్ నష్టపోయింది. 39 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ(29) అవుటయ్యాడు. సంచలన బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్ బౌలింగ్ లో వికెట్ కీపర్ లిటన్ దాస్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
టీమిండియా 10 ఓవర్లలో వికెట్ నష్టపోయి 62 పరుగులుచేసింది. ధావన్(25), కోహ్లి(4) క్రీజులో ఉన్నారు.