రషీద్ ఖాన్ వంటి సంచలన ఆటగాళ్లను పరిచయం చేస్తూ... క్రికెట్లో వేగంగా ఎదుగుతున్న అఫ్గానిస్తాన్కు బీసీసీఐ మరింత చేయూతనిచ్చే నిర్ణయం తీసుకుంది. దీనిప్రకారం ఇకపై భారత్లో పర్యటించే విదేశీ జట్లు తప్పనిసరిగా అఫ్గానిస్తాన్తో ఒక సన్నాహక మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.
రెండు దేశాల క్రికెట్ సంబంధాలపై చర్చించేందుకు ప్రస్తుతం కాబూల్లో ఉన్న బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి ఈ మేరకు ప్రకటించారు. అఫ్గాన్ జూన్ 14న భారత్పై టెస్టుల్లో అరంగేట్రం చేయనుంది. అంతకుముందు డెహ్రాడూన్లో బంగ్లాదేశ్తో మూడు టి20ల సిరీస్ ఆడుతుంది.