మనోళ్లకు మూడు పతకాలు

2 Sep, 2018 10:20 IST|Sakshi

లండన్‌ ఇన్‌లైన్‌ మారథాన్‌ స్కేటింగ్‌ టోర్నమెంట్‌

సాక్షి, హైదరాబాద్‌: లండన్‌ ఇన్‌లైన్‌ మారథాన్‌ స్కేటింగ్‌ కాంపిటీషన్‌లో తెలంగాణ స్కేటర్లు చాణక్య, ఎన్‌. అనిరుధ్, మోనిశ్‌ సాయి ప్రతిభ కనబరిచారు. లండన్‌లోని క్వీన్‌ ఎలిజబెత్‌ ఒలింపిక్‌ పార్క్‌ వేదికగా జరిగిన ఈ టోర్నీలో మూడు పతకాలను సాధించారు. చాణక్య రన్నరప్‌గా నిలిచి రజత పతకాన్ని సొంతం చేసుకోగా... అనిరుధ్, మోనిశ్‌ సాయి మూడోస్థానంలో నిలిచి కాంస్యాలను అందుకున్నారు.

మరిన్ని వార్తలు