ఆలిండియా ఓపెన్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నీ
హైదరాబాద్: ఆలిండియా ఓపెన్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్లో ఫిడే మాస్టర్ జె. రామకృష్ణ (ఆంధ్రాబ్యాంక్) సత్తా చాటాడు. గోవాలో తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి టైటిల్ను కై వసం చేసుకున్నాడు. బుధవారం జరిగిన ఫైనల్ రౌండ్లో రామకృష్ణ (8, ఆంధ్రాబ్యాంక్)... ఇంటర్నేషనల్ మాస్టర్ కులకర్ణి విక్రమాదిత్య (7, వెస్ట్రన్ రైల్వేస్)పై గెలుపొందగా... హిమాన్షు శర్మ (8, హరియాణా)... ఆర్ . బాలసుబ్రహ్మణ్యం (7, తమిళనాడు)పై విజయం సాధించి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అరుుతే మెరుగైన టైట్రేక్ స్కోరు ఆధారంగా రామకృష్ణ విజేతగా నిలవగా... హిమాన్షు వర్మ రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. ఇతర మ్యాచ్ల్లో ఎం. శ్రీనివాసరావు (7, ఆంధ్రప్రదేశ్)... పూబాలన్ (7, తమిళనాడు)పై విజయం సాధించారు. డి. గుకేశ్ (7, తమిళనాడు), ఆది ఆమేయా (7, గోవా) మధ్య జరిగిన మ్యాచ్ డ్రా గా ముగిసింది. విజేతగా నిలిచిన రామకృష్ణను తెలంగాణ చెస్ సంఘం అధ్యక్షుడు ఎ. నరసింహా రెడ్డి, సెక్రటరీ వెంకటేశ్వరరావు అభినందించారు.