టెన్నిస్ చాంప్ హర్షిత్

29 Sep, 2013 00:16 IST|Sakshi

 జింఖానా, న్యూస్‌లైన్: ఏఐటీఏ టాలెంట్ సిరీస్ జూనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీలో బాలుర అండర్-12 విభాగంలో ఆంధ్రప్రదేశ్ కుర్రాడు హర్షిత్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. బోయిన్‌పల్లిలో సూర్య టెన్నిస్ అకాడమీ నిర్వహించిన ఈ టోర్నీలో శనివారం జరిగిన ఫైనల్లో హర్షిత్ 6-3, 0-6, 6-1తో ప్రీతమ్‌పై విజయం సాధించాడు. బాలికల విభాగంలో సంస్కృతి (ఏపీ) 6-4, 6-0తో సాహితి రెడ్డిని ఓడించి ంది.
 
 బాలుర అండర్-14 విభాగంలో అనికేత్ (ఆంధ్రప్రదేశ్) 6-2, 6-3తో సాయి కార్తీక్ (ఏపీ)పై, బాలికల విభాగంలో శ్రావ్య శివాని (ఏపీ) 6-1, 6-1తో ఉమర్ మిష్‌గాన్ (ఏపీ)పై గె లిచింది. అండర్-12 బాలుర డబుల్స్ విభాగంలో ఆదర్శ్-అనురాగ్ అగర్వాల్ జోడి 6-4, 4-6, 6-4తో హర్షిత్-ఆకాష్ జోడిపై నెగ్గింది. అండర్-14 బాలికల విభాగంలో చరిత-లిపిక జోడి 6-4, 4-6, 10-5తో సాహితి రెడ్డి- అనన్య మోహన్ జోడిపై గెలుపొందింది.   
 

మరిన్ని వార్తలు