సాక్షి, హైదరాబాద్: ఆలిండియా జాతీయ ర్యాంకింగ్ టెన్నిస్ చాంపియన్షిప్లో గంట సాయికార్తీక్ సత్తాచాటాడు. నగరంలో జరిగిన ఈ టోర్నమెంట్లో అతను అండర్-16 బాలుర సింగిల్స్ టైటిల్ను చేజిక్కించుకున్నాడు. ఫైనల్లో సాయికార్తీక్ 5-7, 6-1, 6-3తో ఆశిష్ ఆనంద్ (ఏపీ)పై గెలుపొందాడు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో అతను 6-1, 6-2తో ఉత్కర్శ్ సింగ్ (ఢిల్లీ)పై విజయం సాధించాడు. టైటిల్ విజయంతో హైదరాబాద్ కుర్రాడు 15 ర్యాంకింగ్ పాయింట్లను పొందాడు.