25వ సారి డబుల్స్ ఫైనల్‌కు

24 Aug, 2013 01:43 IST|Sakshi

 న్యూ హెవెన్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా డబుల్స్ లో మరో మైలురాయిని అధిగమించింది. న్యూ హెవెన్ ఓపెన్‌లో తుదిపోరుకు అర్హత సంపాదించడం ద్వారా డబ్ల్యూటీఏ డబుల్స్ ఈవెంట్‌లో 25వ సారి ఫైనల్‌కు చేరిన భారత క్రీడాకారిణిగా రికార్డుల్లోకెక్కింది.
 
  జీ జెంగ్‌తో కలిసి మూడో సీడ్‌గా బరిలోకి దిగిన సానియా శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో 6-3, 6-3తో సిల్వియా సొలెర్- కార్ల సూరెజ్ (స్పెయిన్) జంటపై గెలుపొందింది. ఇప్పటివరకూ సానియా ఆడిన 24 డబుల్స్ ఫైనల్స్‌లో 16 సార్లు విజేతగా నిలిచింది.
 

మరిన్ని వార్తలు