లండన్: హమీష్ రూథర్ఫోర్డ్ (35 బంతుల్లో 62; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), బ్రెండన్ మెకల్లమ్ (48 బంతుల్లో 68; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో ఇంగ్లండ్తో జరిగిన తొలి టి20 మ్యాచ్లో న్యూజిలాండ్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో.. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 201 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఇంగ్లండ్పై న్యూజిలాండ్కు ఇదే అత్యధిక స్కోరు. టేలర్ (19 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్సర్) టామ్ లాథమ్ (17 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్సర్)లు రాణించారు. ఇంగ్లండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 196 పరుగులకే పరిమితమైంది. రైట్ (34 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. హేల్స్ (29 బంతుల్లో 39; 5 ఫోర్లు, 1 సిక్సర్), బొపారా (18 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించారు.
క్రికెట్
ఇంగ్లండ్ గీ న్యూజిలాండ్
రెండో టి20
రా. గం.
11.00 నుంచి
స్టార్ క్రికెట్లో
ప్రత్యక్ష ప్రసారం