బుసాన్ (కొరియా): ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ చాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. బుధవారం ఏడు, ఎనిమిది స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్లో భారత్ 3-1తో ఇరాన్పై గెలిచింది. కీలక మ్యాచ్లో ఆచంట శరత్ కమల్ 11-5, 11-9, 7-11, 2-11, 11-7తో నోషద్ అల్మియాన్పై నెగ్గాడు.
అంతకుముందు జరిగిన మ్యాచ్లోనూ శరత్ 8-11, 12-10, 11-9, 11-9తో నీమా అల్మియాన్ను ఓడించి భారత్కు శుభారంభాన్నిచ్చాడు. అయితే రెండో మ్యాచ్లో సౌమ్యజిత్ ఘోష్ 7-11, 6-11, 9-11తో అల్మియాన్ చేతిలో ఓడాడు. నాలుగో మ్యాచ్లో అంథోని అమల్రాజ్ 9-11, 11-7, 11-7, 10-12, 11-5తో మహ్మద్రేజా అలగ్పసంద్పై గెలిచాడు.