సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి సబ్జూనియర్ టెన్నికాయిట్ చాంపియన్షిప్లో పాల్గొనే రాష్ట్ర జట్లను శుక్రవారం ప్రకటించారు. అండర్-14 బాలబాలికల విభాగంలో చెన్నైలోని వెల్లమల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో ఈనెల 19 నుంచి 22 వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ జట్లకు కోచ్లుగా ఎన్. సద్గురు, ఎస్. సందీప్... మేనేజర్లుగా శంకర్, సమ్రీన్ ఫాతిమా వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర జట్టుకు ఎంపికై న క్రీడాకారులకు శాట్స్ ఎండీ దినకర్బాబు స్పోర్ట్సకిట్లను అందజేశారు.
బాలుర జట్టు: మొమమ్మద్ సుజయత్, బి. గణేశ్, ఎన్.అఖిల్, ఎ.మహేందర్, ఎన్.చిరంజీవి, ఆర్.మణికంఠ.
బాలికల జట్టు: ఎం. జ్యోతి, సీహెచ్ మైత్రి, జి.కీర్తన, జి.సుజాత, బి.మాణిక్యం, ఆర్.శిరీష.