భారత్‌-శ్రీలంక మ్యాచ్‌కు వర్షం అంతరాయం

12 Mar, 2018 19:08 IST|Sakshi

కొలంబో: ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా భారత్‌-శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారాడు. టాస్‌ వేసే సయయానికి వర్షం పడటంతో మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.  తేలికపాటి జల్లులు కారణంగా పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. పలుమార్లు పడ్డ చిరుజల్లులు కారణంగా అవుట్‌ ఫీల్డ్‌ చిత్తడిగా మారింది. ఈ సిరీస్‌లో మూడు జట్లు ఒక్కో గెలుపోటములతో ఉండటంతో అందరిని ఫైనల్‌ బెర్తు ఊరిస్తోంది. ఈ నేపథ్యంలో రన్‌రేట్‌పైనో, మరో జట్టు జయాప జయాలతోనో సంబంధం లేకుండా... తమ శక్తిసామర్థ్యాలతోనే టైటిల్‌ పోరుకు అర్హత సాధించాలంటే  నేటి మ్యాచ్‌లో టీమిండియా గెలవాల్సిందే.

ఈ ముక్కోణపు టి20 టోర్నీలో ఇప్పటి వరకైతే భారత్‌ బ్యాటింగ్‌ ఫర్వాలేదు. కానీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఫామ్‌తో పాటు, నిలకడలేని బౌలింగ్‌ జట్టు యాజమాన్యాన్ని కలవరపరుస్తోంది. రెండు మ్యాచ్‌ల సస్పెన్షన్‌ వేటు పడటంతో చండిమాల్‌ స్థానంలో తిసారా పెరీరా లంకకు సారథ్యం వహించనున్నాడు.

>
మరిన్ని వార్తలు