ప్రపంచ చెస్ పోటీలలో ఇద్దరు ఆటగాళ్ల మృతి

15 Aug, 2014 22:39 IST|Sakshi
ప్రపంచ చెస్ పోటీలలో ఇద్దరు ఆటగాళ్ల మృతి
ఓస్లో: నార్వేలో జరుగుతున్న ప్రపంచ చెస్ చాంపియన్ షిప్ లో అపశృతి చోటు చేసుకుంది. ప్రపంచ చాంపియన్ షిప్ లో పాల్గొంటున్న ఇద్దరు ఆటగాళ్లు మృత్యువాత పడ్డారు. సీషెల్స్ కు చెందిన 60 ఏళ్ల ఆటగాడు ఆట మధ్యలోనే కుప్పకూలాడు. కూప్పకూలిన ఆటగాడిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు విఫలయ్యాయి. 
 
ఈ ఘటన పోటీల ఫైనల్ రోజు గురువారం చోటు చేసుకుంది. అయితే ఆదే రోజు ఉజ్బెకిస్థాన్ కు చెందిన మరో ఆటగాడు హోటల్ గదిలో మరణించాడు. ఇద్దరు ఆటగాళ్లు మరణించడం చాలా విషాదకరం అని పోటీలకు సంబంధించిన ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. 
 
ఆటగాళ్ల మృతి వెనుక ఎలాంటి అనుమానాలు కనిపించలేదని పోలీసులు తెలిపారు. ఈ పోటీల్లో చైనా చాంఫియన్ గా అవతరించింది. 
>
మరిన్ని వార్తలు