సయ్యద్ మోడీ బ్యాడ్మింటన్ ఫైనల్లో తెలుగుతేజాలు

24 Jan, 2015 17:15 IST|Sakshi

తెలుగుతేజాలు సైనా నెహ్వాల్, శ్రీకాంత్ మరో సింగిల్స్ టైటిల్కు అడుగు దూరంలో ఉన్నారు. సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో  సైనా, శ్రీకాంత్ ఫైనల్కి చేరారు.

శనివారం జరిగిన మహిళల సెమీస్ లో భారత స్టార్ షట్లర్ సైనా 21-10, 21-16 తేడాతో థాయ్లాండ్కి చెందిన నిచోన్ జిండాపాన్పై  నెగ్గింది. మరో తెలుగుతేజం పి.వి.సింధు, స్పెయిన్కు చెందిన కరోలినా మరిన్కు మధ్య జరిగే మరో సెమీస్ మ్యాచ్లో గెలిచిన వారితో సైనా ఫైనల్లో తలపడనుంది. పురుషుల సింగిల్స్ సెమీస్ లో భారత క్రీడాకారుడు కె.శ్రీకాంత్ 12-21, 21-12, 21-14 తేడాతో హెచ్.ఎస్.ప్రన్నోయ్పై విజయం సాధించాడు.

మరిన్ని వార్తలు