యు ముంబా విజయం

17 Aug, 2019 05:49 IST|Sakshi

అహ్మదాబాద్‌ వేదికగా శుక్రవారం జరిగిన ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌–7 మ్యాచ్‌లో యు ముంబా 34–30తో పట్నా పైరేట్స్‌పై గెలుపొందింది. యు ముంబా రైడర్‌ రోహిత్‌ బలియాన్‌ 9 పాయింట్లతో జట్టుకు విజయాన్ని అందించాడు. మరో మ్యాచ్‌లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ 22–19తో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌పై విజయం సాధించింది. జైపూర్‌ రైడర్‌ దీపక్‌ నివాస్‌ హుడా 7 పాయింట్లతో రాణించాడు. నేటి నుంచి చెన్నైలో పోటీలు జరుగుతాయి.

తొలి రోజు తమిళ్‌ తలైవాస్‌తో బెంగళూరు బుల్స్‌; బెంగాల్‌ వారియర్స్‌తో దబంగ్‌ ఢిల్లీ తలపడతాయి.  

మరిన్ని వార్తలు