చాంపియన్‌ ఉజ్వల

17 Feb, 2019 09:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సెయింట్‌ పాయ్స్‌ డిగ్రీ, పీజీ కాలేజి సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో భాగంగా నిర్వహించిన రన్‌ ఈవెంట్‌లో ఎంఎల్‌ఆర్‌ కాలేజికి చెందిన ఉజ్వల విజేతగా నిలిచింది. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా జరిగిన ఈ పోటీల్లో ఉజ్వల స్వర్ణాన్ని గెలుచుకుంది. శనివారం నిర్వహించిన మహిళల 3 కి.మీ పరుగును ఉజ్వల అందరికంటే ముందుగా 12 నిమిషాల 52.02 సెకన్లలో ముగించి అగ్రస్థానంలో నిలిచింది. సెయింట్‌ ఆన్స్‌కు చెందిన ఎస్‌. అనురాగ రెండోస్థానాన్ని దక్కించుకుంది. అనురాగ పరుగును 13 నిమిషాల 6:59 సెకన్లలో ముగించింది. రైల్వే కాలేజికి చెందిన మమత లక్ష్యాన్ని 15 నిమిషాల 2:15 సెకన్లలో పూర్తి చేసి మూడోస్థానంలో నిలిచింది. 

పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో నిజాం కాలేజి ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఎల్‌బీ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ పరుగులో తొలి 10 స్థానాల్లో నిలిచిన అథ్లెట్లు ధ్రువపత్రాలతో పాటు బహుమతులను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సెయింట్‌ పాయ్స్‌ డిగ్రీ, పీజీ కాలేజి ప్రిన్సిపాల్‌ వేలాంగిణి, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ హెచ్‌ఓడీ దివ్య శ్రీవాస్తవ, ఓయూ ఇంటర్‌ యూనివర్సిటీ టోర్నమెంట్‌ కార్యదర్శి ప్రొఫెసర్‌ బి. సునీల్‌ కుమార్, యూసీపీఈ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ రాజేశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు