అంపైర్ల సంభాషణలు వినొచ్చు

18 Mar, 2015 00:54 IST|Sakshi

సిడ్నీ: ప్రపంచకప్ నాకౌట్ దశ నుంచి టీవీ అంపైర్ల సంభాషణలు కూడా అందరూ వినే అవకాశం ఉంది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్ణయం తీసుకుంది. ‘తొలి క్వార్టర్స్‌లో తలపడనున్న శ్రీలంక, దక్షిణాఫ్రికా మ్యాచ్ నుంచి అనుమానాస్పద నిర్ణయాలపై ఆన్‌ఫీల్డ్ అంపైర్లు, టీవీ అంపైర్ మధ్య జరిగే ఆడియో సంభాషణలు స్టార్ స్పోర్ట్స్‌కు కూడా అందుబాటులో ఉంటాయి’ అని ఐసీసీ పేర్కొంది. గతేడాది నవంబర్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన వన్డే సిరీస్‌లో ఈ ప్రయోగం విజయవంతమైంది.

మరిన్ని వార్తలు