కోల్కతా: భారత్లో జరిగే అండర్–17 ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీల టికెట్ ధరలను ప్రకటించారు. ప్రేక్షకుల ఆదరణను పెంచేందుకు తొలి అంచె మ్యాచ్ టికెట్లను కనిష్టంగా కేవలం రూ.48కే అందించనున్నారు. మంగళవారం రాత్రి 7.11 గంటల నుంచి ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంటాయని టోర్నీ డైరెక్టర్ జేవియర్ కెప్పి తెలిపారు.
ఇతర స్టాండ్స్ టికెట్ ధరలు రూ.96, రూ.192గా ఉన్నాయి. అక్టోబర్ 6 నుంచి 28 వరకు జరిగే ఈ టోర్నీ ఫైనల్కు కోల్కతా వేదికగా నిలుస్తుంది. కోల్కతాలో జరిగే పది మ్యాచ్లకు కలిపి రూ.480తో ప్యాకేజీగా అందిస్తామని... ఇందులో ఫైనల్ మ్యాచ్ టికెట్ కూడా ఉంటుందని కెప్పి తెలిపారు.