పాండ్యా బౌలింగ్‌లో ఫోర్ల వర్షం.!

17 Dec, 2017 14:34 IST|Sakshi

తరంగ అర్ధ సెంచరీ

సాక్షి, విశాఖ: భారత్‌-శ్రీలంక మధ్య జరుగుతున్న నిర్ణయాత్మక మ్యాచ్‌లో లంక ఓపెనర్‌ ఉపుల్‌ తరంగ అర్థ సెంచరీ సాధించాడు.  టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా వేసిన 8 ఓవర్‌లో వరుసగా 5 ఫోర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో శ్రీలంక 9 ఓవర్లలోపే 65 పరుగులు చేసింది. ఈ ఓవర్‌కు ముందు లంక స్కోర్‌ 45/1 ఉండగా.. అనంతరం తరంగ 20 పరుగుల పిండుకోవడంతో 65 పరుగులకు చేరింది.

ఈ దశలోనే తరంగ 36 బంతుల్లో 10 ఫోర్లతో కెరీర్‌లో 36వ అర్ధ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం 12 ఓవర్లకు లంక స్కోర్‌ 73/1. క్రీజులో తరంగ(50)తొ పాటు సమరవిక్రమా(10)లున్నారు. 

మరిన్ని వార్తలు