క్వార్టర్స్‌లో జయరామ్, ఆనంద్ పవార్

9 Jul, 2016 00:31 IST|Sakshi

ఎల్ మాంటె (అమెరికా): భారత షట్లర్లు అజయ్ జయరామ్, ఆనంద్ పవార్ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం అర్ధరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో నాలుగోసీడ్ అజయ్ జయరామ్ 21-11, 21-15తో పెడ్రో మార్టిన్స్ (పోర్చుగల్)పై; ఆనంద్ 21-10, 21-13తో ప్రతుల్ జోషి (భారత్)పై నెగ్గారు. క్వార్టర్స్‌లో ఈ ఇద్దరు తలపడతారు. ఇతర మ్యాచ్‌ల్లో సాయి ప్రణీత్ 21-13, 17-21, 20-22తో కజుమాసా సకాయ్ (జపాన్) చేతిలో; ప్రణయ్ 23-25, 21-23తో లీ హున్ (కొరియా) చేతిలో ఓడారు.

పురుషుల డబుల్స్‌లో రెండోసీడ్ మను అత్రి-సుమీత్ రెడ్డి 23-21, 21-13తో మిత్సుహసి-యుటా వాటాంబే (జపాన్)లపై నెగ్గి క్వార్టర్స్‌కు చేరారు. నాలుగోసీడ్ ప్రణయ్ చోప్రా-అక్షయ్ దివాల్కర్ ద్వయం... ప్రత్యర్థులకు వాకోవర్ ఇచ్చింది. మహిళల సింగిల్స్‌లో తన్వీలాడ్ 17-21, 15-21తో ఐదోసీడ్ బీవెన్ జాంగ్ (అమెరికా) చేతిలో ఓడింది. డబుల్స్‌లో పూర్విషా-మేఘన 21-16, 21-16తో ఆరెల లీ-సిడ్నీ లీ (అమెరికా)పై గెలిచి ముందంజ వేయగా, అనారోగ్యం కారణంగా టాప్‌సీడ్ జ్వాల-అశ్విని జోడి ప్రత్యర్థులకు వాకోవర్ ఇచ్చింది.

>
మరిన్ని వార్తలు