'ఒలింపిక్ గోల్డ్ మెడల్ తెస్తే రూ. 6 కోట్లు ఇస్తాం'

12 Nov, 2014 21:56 IST|Sakshi
'ఒలింపిక్ గోల్డ్ మెడల్ తెస్తే రూ. 6 కోట్లు ఇస్తాం'

లక్నో: ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడల్లో పతకాలు సాధించే ఉత్తప్రదేశ్ క్రీడాకారుల పంట పండనుంది. రానున్న ఒలింపిక్స్ లో మెడల్స్ సాధించిన వారికి ఇచ్చే నగదు ప్రోత్సాహకాన్ని యూపీ ప్రభుత్వం భారీగా పెంచింది.

ఒలింపిక్స్ లో స్వర్ణ పతక విజేతలకు రూ. 6 కోట్లు, వెండి పతకం గెలిచిన వారికి రూ. 4 కోట్లు, కంచు పతకం తెస్తే రూ. 2 కోట్లు ఇస్తామని యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. 35వ జాతీయ జూనియర్ రౌలింగ్ చాంపియన్ షిప్ పోటీలను బుధవారం ఆయన ప్రారంభించారు. యూపీ రౌలింగ్ అసోసియేషన్ వెబ్ సైట్ ను ఆవిష్కరించి, సావనీర్ విడుదల చేశారు.

మరిన్ని వార్తలు