టీఎస్‌టీఏ అధ్యక్షునిగా వెంకటేశ్వర్లు

12 Jun, 2018 10:15 IST|Sakshi

 కార్యదర్శిగా అశోక్‌ కుమార్‌

 నూతన కార్యవర్గం ఎన్నిక

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర టెన్నిస్‌ సంఘం (టీఎస్‌టీఏ) నూతన కార్యవర్గం సోమవారం కొలువుదీరింది. ఆదివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో రాబోయే నాలుగేళ్ల కాలానికి గానూ టీఎస్‌టీఏ అధికారుల్ని ఎన్నుకున్నారు. ఖమ్మం జిల్లా టెన్నిస్‌ సంఘానికి చెందిన మద్దినేని వెంకటేశ్వర్లు టీఎస్‌టీఏ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా జగిత్యాల జిల్లా టెన్నిస్‌ సంఘానికి చెందిన అశోక్‌ కుమార్, సంయుక్త కార్యదర్శిగా వి. నారాయణ్‌ దాస్‌ (మేడ్చల్‌ జిల్లా టెన్నిస్‌ సంఘం), కోశాధికారిగా డి. చంద్రశేఖర్‌ (రంగారెడ్డి జిల్లా లాన్‌ టెన్నిస్‌ సంఘం) నియమితులయ్యారు.

కేఆర్‌ రామన్‌ (రంగారెడ్డి జిల్లా లాన్‌టెన్నిస్‌ సంఘం), టి. నరసింగా రెడ్డి (వరంగల్‌ జిల్లా టెన్నిస్‌ సంఘం), పుల్లారావు (నల్లగొండ జిల్లా లాన్‌టెన్నిస్‌ సంఘం), పి. బాల కిషన్‌ రావు (ఖమ్మం జిల్లా టెన్నిస్‌ సంఘం) ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తారు. ఇతర సభ్యులుగా ఎస్‌. సతీశ్‌ రెడ్డి (నాగర్‌ కర్నూల్‌), ఎస్‌. ముకుంద్‌ రావు (ఆదిలాబాద్‌), డీఆర్‌సీ కిరణ్‌ (మేడ్చల్‌), జి. యుగంధర్‌ రెడ్డి (భద్రాద్రి కొత్తగూడెం), సుల్తాన్‌ ఆసిఫ్‌ ఇక్బాల్‌ (మెదక్‌) ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో అఖిల భారత టెన్నిస్‌ సంఘం సంయుక్త కార్యదర్శి అనిల్‌ ధూపర్‌ రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరించారు. 

మరిన్ని వార్తలు