ఆకట్టుకున్న విజయ్, విక్రమ్‌

15 Jul, 2018 10:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాన్‌సూన్‌ రెగెట్టా జాతీయ ర్యాంకింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ సెయిలర్లు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. హుస్సేన్‌సాగర్‌లో శనివారం జరిగిన మూడోరోజు పోటీల్లో ఆర్మీ బాయ్స్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌కు చెందిన విజయ్‌ 49 పాయింట్లతో రెండోస్థానంలో నిలిచాడు. హైదరాబాద్‌ యాట్‌ క్లబ్‌ సెయిలర్‌ బి. జైకిరణ్‌ మూడో స్థానంలో ఉన్నాడు.

కర్ణాటక త్రిష్ణ సెయిలింగ్‌ క్లబ్‌కు చెందిన చున్ను కుమార్‌ 41 పాయింట్లతో అగ్రస్థానంలోనే ఉన్నాడు. హైదరాబాద్‌ యాట్‌ క్లబ్‌లో శిక్షణ పొంది ఆర్మీ స్కూల్‌కు ఎంపికైన విజయ్‌ శనివారం జరిగిన రెండు రేసుల్లో విజేతగా నిలిచాడు. ఉమా చౌహాన్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌ భోపాల్‌) 49 పాయింట్లతో విజయ్‌తో కలిసి సంయుక్తంగా రెండోస్థానంలో నిలిచింది.

మరిన్ని వార్తలు