అగ్రస్థానంలో విజయ్‌

23 Jul, 2017 14:28 IST|Sakshi
అగ్రస్థానంలో విజయ్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సబ్‌ జూనియర్‌ సెయిలింగ్‌ చాంపియన్‌షిప్‌లో తొలిరోజు రాష్ట్ర సెయిలర్ల హవా కొనసాగింది. హుస్సేన్‌ సాగర్‌ జలాల్లో జరుగుతోన్న ఈ టోర్నీలో రాష్ట్రానికి చెందిన విజయ్‌ సబావత్, దుర్గాప్రసాద్‌ తొలి రెండు స్థానాల్లో నిలిచారు. శనివారం రెండు రేసులు ముగిసేసరికి విజయ్‌ 6 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.

 

దుర్గాప్రసాద్‌ 10 పాయింట్లతో రెండోస్థానంలో ఉన్నాడు. తమిళనాడుకు చెందిన నీలానంద్‌ 12 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. తెలంగాణ సెయిలింగ్‌ సంఘం, హైదరాబాద్‌ యాట్‌ క్లబ్‌ సంయుక్తంగా నిర్వహిస్తోన్న ఈ టోర్నీలో ఆరు రాష్ట్రాలకు చెందిన మొత్తం 71 మంది సెయిలర్లు పాల్గొన్నారు. ఈ టోర్నీ మంగళవారంతో ముగుస్తుంది.

 

>
మరిన్ని వార్తలు