క్వార్టర్స్‌లో వికాస్‌ 

22 Feb, 2018 01:38 IST|Sakshi
వికాస్‌

సోఫియా (బల్గేరియా): స్ట్రాండ్‌జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో భారత బాక్సర్లు వికాస్‌ కృషన్‌ (75 కేజీలు), అమిత్‌ పంఘల్‌ (49 కేజీలు), మనీశ్‌ పన్వర్‌ (81 కేజీలు) క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు.

రెండో రౌండ్‌ బౌట్‌లలో అమీర్‌ గినిఫిడ్‌ (మొరాకో)పై వికాస్‌... శర్విన్‌ (మారిషస్‌)పై అమిత్‌... ఆమిన్‌ (మొరాకో)పై మనీశ్‌ గెలుపొందారు. మరోవైపు మనోజ్‌ (69 కేజీలు) ప్రిక్వార్టర్‌ ఫైనల్లో అబ్దుల్‌ కబీర్‌ (మొరాకో) చేతిలో ఓడిపోయాడు. 

మరిన్ని వార్తలు