రవిశాస్త్రితో నెటిజన్ల ఆట!

6 Nov, 2018 09:30 IST|Sakshi

ముంబై : అదేంటీ టీమిండియా హెడ్‌ కోచ్‌ ట్రైన్‌లో ప్రయాణిస్తున్నాడు.. వెస్టిండీస్‌తో ఈ రోజు టీ20 మ్యాచ్‌ ఉంది కదా.. రవిశాస్త్రి అక్కడుండకుండా ఇక్కడ ఏం చేస్తున్నాడు? అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే.! అయినా ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి అచ్చం రవిశాస్త్రిలానే ఉన్నాడు.. కదా! అంటారా.. అవును అతను రవిశాస్త్రిలా ఉన్నాడు కానీ రవిశాస్త్రి కాదు.  ఒక మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారని అంటారు కదా.. అందులో ఈయన ఒకడు. మిగతా ఐదుగురు ఎక్కడా అని మాత్రం అడగకండి. అదేనండి అచ్చం భారత కోచ్‌లా ఉన్న ఈ వ్యక్తి పేరు వర్మ.. ఊరు ముంబై. సబర్బన్‌ ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా తీసిన ఫొటో ఇది. (చదవండి: సమమా? సిరీసా?)

ఇంకేముంది ఈ రవిశాస్త్రి డూప్‌తో మన నెట్టింటి పోరగాళ్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. ఫన్నీ మెమ్స్‌, ట్రోల్స్‌తో రచ్చ రచ్చ చేస్తున్నారు. 2019 ప్రపంచకప్‌ తర్వాత రవిశాస్త్రని ఒకడంటే.. బీసీసీఐ ట్రావెల్‌ అలవెన్స్‌లు ఇస్తలేదని మరొకడు.. రోహిత్‌ మొత్తం కెప్టెన్‌ అయితే ఆయన పరిస్థితిదేనని ఇంకొకడు కామెంట్‌ చేస్తున్నారు. కోహ్లి డ్రింక్స్‌ పార్టీకి శాస్త్రిని పిలవలేదని, అందుకే అలిగి ట్రైన్‌ వెళ్లిపోయాడని కూడా సెటైర్లేస్తున్నారు. ( చదవండి: గంభీర్‌ అసలు ఏమైంది నీకు!)

మరిన్ని వార్తలు