కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌కు రూ.కోటి

24 Jul, 2019 15:25 IST|Sakshi
విరాట్‌ కోహ్లి

న్యూఢిల్లీ : ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యాపార ప్రకటన ద్వారా అత్యధికంగా ఆర్జించే ఆటగాళ్ల జాబితా-2019లో విరాట్‌ కోహ్లి టాప్‌-10లో నిలిచాడు. తాజాగా విడుదల చేసిన వివరాల ప్రకారం తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో స్పాన్సర్డ్ పోస్ట్‌లు వేయడానికి కోహ్లి భారీ మొత్తం వసూలు చేస్తున్నాడు. అత్యధిక మొత్తం తీసుకుంటున్న అథ్లెట్ల లిస్ట్‌లో పోర్చ్‌గల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. కోహ్లి 9వ స్థానంలో నిలిచాడు. 

కోహ్లి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యాపార ప్రకటనను పోస్ట్‌ చేయడానికి రూ. కోటి 35 లక్షలు వసూలు చేస్తున్నాడు. కోహ్లికి ఇన్‌స్టాగ్రామ్‌లో 3.81 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఈ లిస్ట్‌లో రొనాల్డో తర్వాత నెయ్‌మార్, మెస్సీ, బెక్‌హామ్, జేమ్స్‌, రొనాల్డో మొరైరా, గారెత్ బేల్, ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు ఉన్నారు. 8వ స్థానంలో ఇబ్రహిమోవిక్‌ ఉండగా.. కోహ్లి తర్వాత పదో స్థానంలో ఉరుగ్వే ఫుట్‌బాల్‌ ఆటగాడు లూయిస్ సువరేజ్‌ ఉన్నాడు. 15 స్థానంలోని నిలిచిన అమెరికా దిగ్గజ రెజ్లర్‌ రోజర్‌ రౌసీ, 16 స్థానంలో ఉన్న టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌లు ఇద్దరే టాప్‌-16లో నిలిచిన మహిళా క్రీడాకారులు కావడం విశేషం. ఇక టాప్ టెన్‌లో నిలిచిన ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లినే కావడం మరో విశేషం. అగ్రస్థానంలో ఉన్న రొనాల్డో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క వ్యాపార ప్రకటనకు రూ.6 కోట్ల 72 లక్షలు వసూలు చేస్తున్నాడు.

>
మరిన్ని వార్తలు