కోహ్లి చాలెంజ్‌‌.. మీసం మెలేసిన ధావన్‌

10 Mar, 2018 17:20 IST|Sakshi

సాక్షి, స్పోర్ట్స్‌ : భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి శిఖర్‌ ధావన్‌కు ఓ చాలెంజ్‌ విసిరాడు. కోహ్లి ఓ ప్రముఖ బ్యాగ్‌ల కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల కోహ్లీ ఓ బ్యాగ్‌ను భుజానికి తగిలించుకుని డ్యాన్స్‌తో దుమ్ములేపాడు. అయితే శిఖర్‌ ధావన్‌కు తనలాగే బ్యాగ్‌ తగిలించుకుని డ్యాన్స్‌ చేయాలని విరాట్‌ తన ట్విటన్‌ ద్వారా ఛాలెంజ్‌ విసిరాడు. ‘నా కంటే నువ్వు బాగా డ్యాన్స్‌ వేయగలవా? నీ డ్యాన్స్‌ స్టెప్పులు చూపించు’ అని కోహ్లీ తాను డ్యాన్స్‌ చేసిన ఓ వీడియోను ట్విట్‌ చేశారు. 

దీంతో లంక పర్యటనలో ఉన్న ధావన్ కోహ్లీ ఛాలెంజను స్వీకరించాడు. ధావన్‌ తాను కూడా బ్యాగ్‌ తగిలించుకుని మీసం మెలేసి, తొడకొట్టి స్టెప్పులేసిన వీడియోను తన ట్వీటర్‌లో పంచుకున్నారు.  ప్రస్తుతం ముక్కోణపు టోర్నీ నుంచి కోహ్లీకి బీసీసీఐ విశ్రాంతి కల్పించిన సంగతి తెలిసిందే. 
 

>
మరిన్ని వార్తలు