అడిలైడ్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సెంచరీ సాధించాడు. 108 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్స్లతో కెరీర్లో 39వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ధావన్ వికెట్ అనంతరం క్రీజులో వచ్చిన కోహ్లి మరో ఓపెనర్ రోహిత్ శర్మ (43)తో కలిసి 54 పరుగులు జోడించాడు. అయితే భారీ షాట్కు ప్రయత్నించి రోహిత్ వెనుదిరగగా.. అనంతరం క్రీజులోకి వచ్చిన రాయుడుతో కోహ్లి బాధ్యాతాయుతంగా ఆడాడు.
అంబటి రాయుడు 24(36 బంతుల్లో ).. మ్యాక్స్వెల్ బౌలింగ్లో స్టోయినిస్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో మూడో వికెట్కు నమోదైన 59 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ధోనితో కోహ్లి దాటిగా ఆడాడు. 66 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి మరో 42 బంతుల్లోనే సెంచరీ సాధించడం విశేషం.