వైరల్‌ : కోహ్లి సెంచరీ‌.. మురిసిన అనుష్కా!

3 Aug, 2018 12:30 IST|Sakshi
విరాట్‌ కోహ్లి, అనుష్క శర్మ

బర్మింగ్‌ హోమ్‌ : ఒంటి చేత్తో ఇంగ్లండ్‌ బౌలర్లను ఓ ఆట ఆడుకోని శతకం సాధించిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని చూసి అతని సతీమణి, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ మురిసిపోయింది. ప్రస్తుతం కోహ్లితో పాటు ఇంగ్లండ్‌లోనే ఉన్న అనుష్క ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగిన తొలి టెస్టుకు హాజరైంది. ఇక సెంచరీ అనంతరం కోహ్లి ఈ ఇన్నింగ్స్‌ను తన సతీమణికి అంకితం ఇస్తూ.. సంబరాలు చేసుకున్నాడు. చైన్‌తో తన మెడలో వేసుకున్న వెడ్డింగ్‌ రింగ్‌కు ముద్దిస్తూ.. స్టాండ్స్‌లో ఉన్న అనుష్క వైపుకూ చూస్తూ ఓ ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చాడు. దీనికి అనుష్క ఆనందరతో గంతులేసింది. ప్రస్తుతం ఈ సెలెబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది.

182 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్‌ను కోహ్లి (225 బంతుల్లో 149; 22 ఫోర్లు, 1 సిక్స్‌) టెయిలండర్లతో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడి గట్టెక్కించాడు. ఇంగ్లండ్‌ బౌలర్ల సహనానికే పరీక్షగా నిలిచాడు. అప్పటి వరకు విజృంభించిన ఇంగ్లండ్‌ బౌలర్లు కోహ్లి దాటికి చేతులెత్తేసారు. 21, 51 పరుగుల వద్ద కోహ్లి ఇచ్చిన క్యాచ్‌లను మలాన్‌ జారవిడవడంతో తగిన మూల్యం చెల్లించుకున్నారు. పాండ్యా ఆరో వికెట్‌గా వెనుదిరిగిన సమయంలో జట్టు స్కోరు 148 పరుగులు కాగా... కోహ్లి 47 వద్ద ఆడుతున్నాడు. పాండ్యా వెనుదిరిగాక భారత్‌ ఖాతాలో చేరిన 126 పరుగుల్లో కోహ్లి చేసినవే 102 ఉండటం గమనార్హం.

చదవండి: దటీజ్‌ కోహ్లి!

మరిన్ని వార్తలు