ఈ జట్టుతో సంతోషంగా ఉన్నా

21 Dec, 2019 03:16 IST|Sakshi
భారత జట్టు సహచరులతో కోహ్లి

ఆర్‌సీబీ కొత్త ఆటగాళ్లపై కోహ్లి

న్యూఢిల్లీ: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) ఈ వేలంలో మేటి ఆటగాళ్లను దక్కించుకుందని ఆ ఫ్రాంచైజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. కోల్‌కతాలో గురువారం జరిగిన వేలంలో బెంగళూరు జట్టు ఎనిమిది మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. వీరిలో ఆసీస్‌ కెప్టెన్‌ ఫించ్‌తో పాటు ఆల్‌రౌండర్లు మోరిస్, స్టెయిన్‌ (దక్షిణాఫ్రికా), కేన్‌ రిచర్డ్‌సన్‌ (ఆస్ట్రేలియా) కీలక ఆటగాళ్లు. దీనిపై భారత కెప్టెన్‌ కోహ్లి మాట్లాడుతూ ‘కొత్తగా వచ్చిన ఆటగాళ్లతో జట్టు మరింత పటిష్టమైంది. మొత్తానికి మంచి జట్టు తయారైందని సంతోషంగా ఉంది. జట్టు నిర్మాణం, సమతౌల్యంపై మేం ఇదివరకే చాలా చర్చించుకున్నాం. అనుకున్నట్లుగానే అనుభవజ్ఞులు మా జట్టుకు జతయ్యారు. వచ్చే సీజన్‌లో మేం తప్పకుండా రాణిస్తాం’ అని అన్నాడు.  

మరిన్ని వార్తలు