‘టాప్‌’ ర్యాంక్‌లోనే కోహ్లి, బుమ్రా 

14 Nov, 2018 01:40 IST|Sakshi

దుబాయ్‌: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, జస్‌ప్రీత్‌ బుమ్రా అగ్రస్థానాలను నిలబెట్టుకున్నారు. మంగళవారం ప్రకటించిన బ్యాట్స్‌మెన్‌ ర్యాంకుల్లో భారత కెప్టెన్‌ 899 పాయింట్లతో నంబర్‌వన్‌గా ఉండగా, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 871 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.

మరో భారత ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ 8వ స్థానంలో ఉండటంతో ఐసీసీ టాప్‌–10లో భారత టాప్‌–3 బ్యాట్స్‌మెన్‌లకే చోటు దక్కినట్లయింది. బౌలర్ల విభాగంలో బుమ్రా (841 పాయింట్లు) మొదటి స్థానంలో ఉండగా...కుల్దీప్‌ యాదవ్‌ (3), యజువేంద్ర చహల్‌ (5) కూడా టాప్‌–10లో కొనసాగుతుండటం విశేషం. వన్డే టీమ్‌ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌ (126) తర్వాత భారత్‌ (121) రెండో స్థానంలో నిలిచింది. 

మరిన్ని వార్తలు