ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్
బ్రిస్బేన్: ఐసీసీ తాజా వన్డే ర్యాకింగ్స్లో స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లి ఒక స్థానం దిగజారి నాలుగో స్థానంలో నిలిచాడు. సోమవారం ప్రకటించిన ఈ ర్యాకింగ్స్లో భారత కెప్టెన్ ధోని రెండు స్థానాలు కోల్పోయి పదో స్థానంలో నిలిచాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ తన ఏడో ర్యాంక్ని నిలబెట్టుకున్నాడు. దక్షిణాఫ్రికా కెప్టెన్ డి విలియర్స్ టాప్లో ఉండగా.... సంగక్కర, ఆమ్లా సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు.
ఇక బౌలింగ్ విభాగంలో భారత్ నుంచి ఒక్కరు కూడా టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయారు. మహ్మద్ షమీ 14 స్థానాలు ఎగబాకి 11వ ర్యాంకుకు చేరగా.. అశ్విన్ 16వ స్థానంలో అన్నాడు. భువనేశ్వర్, జడేజా 17, 18వ ర్యాంకుల్లో ఉన్నారు. ప్రపంచకప్లో ఆడలేకపోయినా పాక్ స్పిన్నర్ అజ్మల్ ఇంకా అగ్రస్థానంలోనే ఉన్నాడు. వన్డే ఆల్రౌండర్స్ ర్యాంకిం గ్స్లో దిల్షాన్ అగ్రస్థానంలో ఉండగా జడేజా ఏడో స్థానంలో ఉన్నాడు. టీమ్ ర్యాంకింగ్స్లో ఆసీస్, భార త్, దక్షిణాఫ్రికా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.