కివీస్‌ చేరిన కోహ్లి బృందం

22 Jan, 2020 03:23 IST|Sakshi

ఆక్లాండ్‌: మూడు ఫార్మాట్‌లలోనూ న్యూజిలాండ్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు భారత క్రికెట్‌ జట్టు కివీస్‌ గడ్డపై అడుగు పెట్టింది. ఆక్లాండ్‌ చేరుకున్నామంటూ కెప్టెన్‌ కోహ్లి సహచర ఆటగాళ్లు అయ్యర్, శార్దుల్‌లతో కలిసి ట్వీట్‌ చేశాడు. ఈ పర్యటనలో భారత్, కివీస్‌ మధ్య 5 టి20లు, 3 వన్డేలు, 2 టెస్టులు జరుగుతాయి. ఈ నెల 24న తొలి టి20 మ్యాచ్‌తో పోరు మొదలవుతుంది. గత ఏడాది న్యూజిలాండ్‌లో పర్యటించిన భారత్‌ వన్డే సిరీస్‌ను 4–1తో గెలుచుకొని టి20 సిరీస్‌ను 1–2తో కోల్పోయింది.   

మరిన్ని వార్తలు