ఇన్‌స్టాగ్రామ్‌ అవార్డు అందుకున్న కోహ్లి!

31 Mar, 2018 19:31 IST|Sakshi
ఇన్‌స్టాగ్రామ్‌ అవార్డుతో కోహ్లి

న్యూఢిల్లీ: మైదానంలో రికార్డులు సృష్టించే టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సామాజిక మాధ్యమాల్లో సైతం దూసుకెళ్తున్నాడు. సోషల్ మీడియా నెట్‌వర్క్ ఇన్‌స్టాగ్రామ్‌ భారత్ మోస్ట్ ఎంగేజ్డ్ అకౌంట్‌  అవార్డును కోహ్లికి అందజేసింది. ఈ సందర్భంగా కోహ్లి అవార్డుతో ఉన్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. ‘కొంచెం ఆలస్యమైంది. అయినప్పటికీ ఈ అవార్డును ప్రకటించిన ఇన్‌స్టాగ్రామ్‌కు ధన్యవాదాలు. ఎల్లప్పుడూ నాకు మద్దతుగా నిలిచి, ప్రేమను పంచిన అభిమానులకు బిగ్‌ థ్యాంక్స్‌. ఇది మీ వల్లే వచ్చింది. ఎందుకంటే నేను ఎప్పుడూ సరైన పనులు చేసేందుకు మీరు స్పూర్తిగా నిలిచారు.’ అని పోస్ట్‌లో పేర్కొన్నాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీని 20.1 మిలియన్ల మంది ఫాలోఅవుతున్నారు. గత కొన్నేళ్లుగా కోహ్లి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో టచ్‌లో ఉంటున్నాడు. ప్రతి విషయం పై  స్పందిస్తూ.. తన వ్యక్తిగత, క్రికెట్ కెరీర్‌కు సంబంధించిన విషయాలను  పంచుకుంటున్నాడు. ఇక ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఈ ఢిల్లీ ఆటగాడు నెట్స్‌లో తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు.

>
మరిన్ని వార్తలు