సచిన్‌ను అధిగమించిన కోహ్లి

24 Dec, 2014 01:16 IST|Sakshi

ట్విట్టర్‌లో అగ్రస్థానం
 ముంబై: భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి... బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను అధిగమించాడు. అయితే ఇది ఏ పరుగుల విషయంలోనో అనుకుంటే పొరపాటే. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ట్విట్టర్‌లో అత్యధిక సంఖ్యలో అభిమానులు కలిగిన భారతీయ క్రీడాకారుడిగా కోహ్లి (@iamvkohli) తొలి స్థానంలో నిలిచాడు.
 
 ఈ విషయంలో సచిన్‌ను తోసిరాజని కోహ్లి 48 లక్షల 70 వేల 190 మంది ఫాలోవర్లను కలిగి ఉన్నాడు. సచిన్‌ను 48,69,849 మంది అనుసరిస్తున్నారు. కెప్టెన్ ధోని (33,27,033), యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. టాప్-10 క్రీడాకారుల్లో తొమ్మిది మంది క్రికెటర్లే ఉండగా... ఇతర క్రీడల నుంచి సానియా మీర్జాకు టాప్-10 జాబితాలో చోటు దక్కింది.

మరిన్ని వార్తలు