ఫైనల్లో విష్ణువర్ధన్‌ జోడీ

17 Mar, 2017 12:14 IST|Sakshi
ఫైనల్లో విష్ణువర్ధన్‌ జోడీ

బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) ఫ్యూచర్స్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ విష్ణువర్ధన్‌ డబుల్స్‌ టైటిల్‌కు మరో విజయం దూరంలో నిలిచాడు. కర్ణాటక స్టేట్‌ లాన్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో విష్ణువర్ధన్‌–శ్రీరామ్‌ బాలాజీ (భారత్‌) ద్వయం ఫైనల్‌కు చేరుకుంది.

 

గురువారం జరిగిన సెమీస్‌లో టాప్‌ సీడ్‌ విష్ణువర్ధన్‌–శ్రీరామ్‌ బాలాజీ జంట 7–6 (7/3), 6–0తో అలెగ్జాండర్‌ సెంటినరీ (అమెరికా)–సామి రెన్‌వెన్‌ (జర్మనీ) జోడీపై గెలిచింది. ఫైనల్లో భారత్‌కే చెందిన ‘సూద్‌ బ్రదర్స్‌’ చంద్రిల్‌–లక్షిత్‌ జంటతో విష్ణువర్ధన్‌ జోడీ తలపడుతుంది. మరోవైపు సింగిల్స్‌ విభాగంలో విష్ణువర్ధన్‌ పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. క్వార్టర్స్‌లో విష్ణు 7–6 (9/7), 5–7, 3–6తో సామి రెన్‌వెన్‌ (జర్మనీ) చేతిలో ఓటమి పాలయ్యాడు.
 

మరిన్ని వార్తలు