క్వార్టర్స్‌లో విష్ణువర్ధన్

8 Nov, 2016 00:20 IST|Sakshi

కోల్‌కతా: ఆసియా టెన్నిస్ టూర్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. అలోక్ గోయల్‌తో సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో విష్ణు 6-2, 6-1తో గెలిచాడు. భారత్‌కే చెందిన రంజిత్ విరాళీ మురుగేశన్, పరీక్షిత్ సొమాని, రోహిత్ రామ్‌పురియా, జగ్‌మీత్ సింగ్, నితిన్ కుమార్, సౌరవ్ సుకుల్ కూడా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. 

మరిన్ని వార్తలు