సంయుక్తంగా రెండో స్థానంలో ఆనంద్‌ 

9 Jun, 2018 01:29 IST|Sakshi

ఆల్టిబాక్స్‌ నార్వే అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. నార్వేలోని స్టావెంజర్‌ నగరంలో జరిగిన ఈ టోర్నీలో ఆనంద్‌ చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో సెర్గీ కర్జాకిన్‌ (రష్యా)పై 32 ఎత్తుల్లో గెలిచాడు.

ఆనంద్‌తోపాటు మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే), నకముర (అమెరికా) 4.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. పది మంది గ్రాండ్‌మాస్టర్లు పోటీపడ్డ     ఈ టోర్నీలో అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ ఫాబియానో కరువానా ఐదు పాయింట్లతో అగ్రస్థానం దక్కించుకున్నాడు.  

మరిన్ని వార్తలు